కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్వీయ నిర్బంధం యాప్ ప్రారంభించిన యూఏఈ
- April 04, 2020కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్వీయ నిర్బంధం పాటించాల్సిన వారి విషయం యూఏఈ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినా, కరోనా పాజిటీవ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నా తప్పనిసరిగా నిర్బంధం పాటించాల్సి ఉంటుంది. అయితే..కొందరు నిర్బంధం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో యూఏఈ నిర్బంధంలో ఉన్న వారిపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా ఓ Stay Home యాప్ ను ప్రారంభించింది. నిర్బంధం పాటించాల్సిన వ్యక్తులు తప్పనిసరిగా తమ మొబైల్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు ఎటూ కదిలినా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అలా నిర్బంధం పాటించని వ్యక్తులను వెంటనే పసిగట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా యూఏఈ చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా