బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతానికి ముందడుగు పడింది. బహ్రెయిన్ యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి, కింగ్ ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా సెర్బియాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సెర్బియన్ వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సమీర్ అబ్దుల్లా నాస్ అధ్యక్షత వహించారు. సెర్బియాలో బహ్రెయిన్ రాయబారి అహ్మద్ అబ్దుల్రెహ్మాన్ అల్-సాత్సీతోపాటు రెండు దేశాల నుండి ప్రముఖ వ్యాపారవేత్తలు , సీనియర్ కార్పొరేట్ అధికారులు పాల్గొన్నారు.
బహ్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. కీలక ఆర్థిక రంగాలు స్థిరమైన అభివృద్ధికి పునాదిగా పనిచేస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించడానికి విస్తృత అవకాశాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్ మిక్సింగ్ ఆర్థిక వ్యవస్థ ఆదాయ వైవిధ్యానికి దోహదపడతాయని, జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని మిస్టర్ నాస్ పేర్కొన్నారు.
బహ్రెయిన్-సెర్బియా ద్వైపాక్షిక సంబంధాలలో వృద్ధి, శ్రేయస్సు కోసం బలమైన సామర్థ్యంపై కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడంతోపాటు పలు రంగాలలో పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడంపై సమావేశం ఫోకస్ చేసింది.ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, అల్యూమినియం ఉత్పత్తి, రియల్ ఎస్టేట్, పెట్టుబడితో సహా కీలక రంగాలలో బహ్రెయిన్ అనుభవం మరియు పోటీతత్వ ప్రయోజనాన్ని చర్చలలో హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్









