కోవిడ్ 19:ఖతార్ లో కార్మికులందరికీ ఉచిత చికిత్స
- April 08, 2020
దోహా:కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్య భద్రతకు ఖతార్ లోని కార్మిక, సాంఘిక వ్యవహారాలు, కార్మిక అభివృద్ధి శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కార్మికుల స్టేటస్ తో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందనుంది. కరోనా సంక్షోభం కారణంగా కార్మికులకు హెల్త్ కార్డు, ఖతార్ ఐడీ కార్డుతో సంబంధం లేకుండా వైరస్ నిర్ధారిత పరీక్షలతో పాటు ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తుంది. కార్మికులు ఎవరికైనా కరోనా పాజిటీవ్ అని తేలితే వారిని ముకైనీస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరానికి తరలిస్తారు. అక్కడే ఉచితంగా ట్రీట్మెంట్ అందిస్తారు. అంతేకాదు..ఏ కారణం చేతనైనా సరే నిర్బంధంలో ఉండాల్సి వస్తే ఆ కాలానికి జీతంలో కోత విధంచరు. నిర్బంధ కాలానికిగాను బేసిక్ శాలరీతో పాటు అలవెన్స్ లు యధాప్రకారం ఇస్తారు. సిక్ బెనిఫిట్స్ అన్నివర్తిస్తాయి. పని ప్రాంతంలోగానీ, అకామిడేషన్ దగ్గర గాని ఎవరైనా కార్మికుడు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తే మిగతా కార్మికులు వెంటనే అతని దూరంగా ఉండాలని, ఖతార్ కోవిడ్19 హాట్ లైన్ నెంబర్ 16000 ఫోన్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ తమ మార్గదర్శకాల్లో సూచించింది. ఎదైనా అత్యవసరంగా భావిస్తే ఆంబులెన్స్ కోసం 999కి కాల్ చేయాలని పేర్కొంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







