సౌదీలో 2 లక్షల మందికి కరోనా సోకే అవకాశాలు ఉంటాయని అంచనా
- April 08, 2020
రియాద్:ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 13 లక్షల మందిని బాధితులుగా మార్చిన కరోనా వైరస్ మరింత శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దాదాపు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైరస్ ప్రభావం తమ దేశంపై ఎలా ఉండొచ్చని సౌదీ అరేబియా ఓ అంచనాకు వచ్చింది. వైరస్ పై అందిన నాలుగు నివేదికల ఆధారంగా రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది నుంచి 2 లక్షల మంది వైరస్ బారిన పడొచ్చని అంచనా వేస్తోంది. అందుకు తగినట్లుగా దేశంలోని పాలన వ్యవస్థలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ సహకార మండలి-జీసీసీలోని ఆరు సభ్య దేశాల్లో కరోనా ఎఫెక్ట్ సౌదీ అరేబియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. సౌదీలో దాదాపు 2,795 పాజిటీవ్ కేసులు నమోదైతే..41 మంది మరణించారు. తాము ఇప్పుడు సమాజ భద్రత, దేశ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి ఓ నిర్ణయాత్మక సమయంలో ఉన్నామని, మహమ్మారి కరోనాను అరికట్టేందుకు తమ వంతు పాత్రను బాధ్యతగా నిర్వహిస్తామని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే..వైరస్ తో పొంచి ఉన్న ప్రమాద తీవ్రత తెలియక కొందరు లాక్ డౌన్ కు విరుద్ధంగా రోడ్ల మీదకు వస్తున్నారని, గుంపులుగా పోగవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రోడ్ల మీద కేవలం 50 శాతం మాత్రమే ట్రాఫిక్ తగ్గినట్లు తెలిపింది. దీంతో అవసరమైన ప్రాంతాల్లో 24 గంటల కర్ఫ్యూ అమలు చేస్తున్నామని కూడా వెల్లడించింది. కరోనాపై పోరాటంలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కింగ్ సల్మాన్ 7 బిలియన్ల రియాల్స్ విడుదల చేశారు. వైరస్ నియంత్రణ చర్యలు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది చివరి నాటి 32 బిలియన్ల రియాల్స్ వరకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







