మరోసారి జీ20 మీట్
- April 10, 2020
కరోనా కారణంగా దెబ్బతిన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే అంశంపై చర్చించేందుకు జీ 20దేశాలు మరోసారి సమావేశం కానున్నాయి. మార్చి చివరలో వర్చువల్ సమావేశాలు నిర్వహించిన ఈ కూటమి ప్రపంచ మార్కెట్లోకి అత్యవసరంగా 8 బిలియన్ డాలర్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించాయి. తాజాగా కరోనాను అదుపుచేసే క్రమంలో లాక్డౌన్లు ప్రకటించటంతో ఆర్థిక వ్యవస్థలకు ఏమేరకు నష్టం జరిగింది? మళ్లీ గాడిలో పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను చర్చించేందుకు జీ 20దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశాలు ఎంతో కీలకమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో భారత ప్రతినిధులుగా ఆర్థిక మంత్రి నిర్మళాసీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







