కోవిడ్ 19: రెసిడెన్సీ, విజిట్ వీసాల గడువు ఈ ఏడాది చివరి వరకు పొడిగింపు
- April 14, 2020
యూ.ఏ.ఈ:కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులకు, నివాసితులకు యూఏఈ ప్రభుత్వం ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. అన్ని రకాల వీసాలు, ఎమిరాతి ఐడీ, ప్రవేశ అనుమతుల గడువును ఈ ఏడాది చివరికి వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు పౌరవ్యవహారాల గుర్తింపు ఫెడరల్ అధికార ప్రతినిధి కల్నల్ కమిస్ అల్ కాబి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. మార్చి 1 నాటితో గడువు ముగిసిన అన్ని రకాల వీసాలు, ప్రవేశ అనుమతి(ఎంట్రీ పర్మిట్లు) గడువును డిసెంబర్ 2020 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. ప్రవాసీయుల వీసా గడువును కూడా డిసెంబర్ వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వైరస్ తో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని ప్రతి వ్యక్తి సంరక్షణ తమ బాధ్యతని అన్నారు. అయితే..ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చాలామంది ప్రవాసీయులు, పర్యాటకులు తమ దేశానికి వెళ్లిపోతామని విన్నపాలు వస్తున్నాయని, వాళ్ల అభ్యర్ధనలపై యూఏఈ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ