కువైట్:స్టెరిలైజర్స్ తయారీకి 1200 బ్యారెల్స్ ఇథనాల్ ను దిగుమతి చేసుకున్న
- April 14, 2020
కువైట్:కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కువైట్ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది. వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమైన నేపథ్యంలో దేశ ప్రజలకు స్టెరిలైజర్స్ (చేతులను శుభ్రం చేసుకునే రసాయనం) కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. డిమాండ్ కు సరిపడ స్టెరిలైజర్స్ తయారీ కోసం తొలి విడతగా దాదాపు 1200 బ్యారెల్స్ ఇథనాల్ ను దిగుమతి చేసుకుంది. మంత్రివర్గ సమావేశం 396 తీర్మానం మేరకు అందరికీ కరోనా నుంచి రక్షణ కల్పించే ఉత్పత్తులను అందుబాటులో ఉండాలన్న తీర్మానంలో భాగంగా ఇథనాల్ ను దిగుమతి చేసుకుంది. ఈ 1200 బ్యారెళ్ల ఇథనాల్ తో 500 మిల్లీ లీటర్ల చొప్పున ఒక్కో శానిటైజర్ ను తయారు చేయనున్నారు. దాదాపు మిలియన్ బాటిల్స్ తయారు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







