ఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న వారికి సుప్రీంలో తప్పని నిరాశ
- April 13, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయటంతో భారత్కు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదోలా తమను తిరిగి భారత్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలకు వినతులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ కు ప్రాధాన్యత ఏర్పడింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు..కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులను తీసుకురావాలని కూడా ఆదేశించలేమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడ ఉండటమే అందరికీ శ్రేయస్కరమని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే..విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







