ఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న వారికి సుప్రీంలో తప్పని నిరాశ
- April 13, 2020
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాల్లో భారతీయులు చిక్కుకుపోయారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయటంతో భారత్కు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదోలా తమను తిరిగి భారత్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలకు వినతులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ కు ప్రాధాన్యత ఏర్పడింది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు..కేంద్రాన్ని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదే సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులను తీసుకురావాలని కూడా ఆదేశించలేమని స్పష్టం చేసింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఎక్కడివారు అక్కడ ఉండటమే అందరికీ శ్రేయస్కరమని కూడా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే..విదేశాల్లో చిక్కుకుపోయిన వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?