కోవిడ్ 19: కార్మికులు కదలికలపై కొత్త ఆంక్షలు విధించిన షార్జా అధికారులు
- April 16, 2020
షార్జాలోని కార్మికులు ఇతర ఎమిరాతిస్ కు వెళ్లకుండా నియంత్రణ చర్యలు చేపట్టింది. కార్మికుల కదలికలపై ఆంక్షలు విధిస్తూ షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వుల మేరకు ఇక నుంచి కార్మికులు షార్జా దాటి బయటికి వెళ్లటానికి వీలు లేదు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ ఛైర్మన్ వెల్లడించారు. కార్మికులు, షార్జా పౌరుల ఆరోగ్య భద్రత తమ లక్ష్యమని వివరించారు. ఒక వేళ ఎవరైనా నిబంధనలను ఖాతరు చేయకుంటే వారిపై జరిమానా విధిస్తామని కూడా చైర్మన్ హెచ్చరించారు. అయితే..క్లీనింగ్, ఆహార సరఫరా, ప్రైవేట్ సెక్యూరిటీ రంగాల్లోని పని చేసే కార్మికులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే కార్మికులు తరలించే సమయంలో రవాణ వాహనంలోని సామార్ధ్యానికి సగానికి మాత్రమే కార్మికులను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కార్మికులు తప్పసరిగా మాస్కులు ధరించటంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని కూడా షార్జా ఆర్ధికాభివృద్ధి డిపార్ట్మెంట్ సూచించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







