ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్ రద్దు
- January 27, 2016
ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్ని సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి బిడ్డర్స్ అందరికీ రాతపూర్వకంగా సమాచారం అందించడం జరిగిందని యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ డెవలపర్ మరియు ఆపరేటర్ వెల్లడించారు. గ్వెయిఫాత్ వద్ద సౌదీ బోర్డర్ నుంచి అల్ ఎయిన్ వద్ద ఒమన్ బోర్డర్ వరకూ కనెక్ట్ చేసే రైల్ నెట్వర్క్లో భాగంగా ఎతిహాద్ రైల్ స్టేజ్ 2ను ప్లాన్ చేశారు. ముసాఫా, ఖలీఫా పోర్ట్ జెబెల్ అలీ పోర్ట్లను కలిపేలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఎతిహాద్ రైల్ ఇప్పటికే స్టేజ్ వన్ రైల్ నెట్వర్క్ని ప్రారంభించింది. 4 మిలియన్ టన్నుల సల్ఫర్ షా అండ్ హబ్సన్ నుంచి రువాయిస్ పోర్ట్ వరకు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ కోసం సరఫరా చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కమర్షియల్ కెపాసిటీని రీచ్ అయితే ఏడు మిలియన్ టన్నుల సల్ఫర్ని ప్రతి సంవత్సరం సరఫరా చేయగలుగుతుంది. మొత్తం మూడు స్టేజ్లలో ఎతిహాద్ రైల్ నెట్వర్క్ని ప్లాన్ చేశారు. ఇది జిసిఇ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేయవలసి ఉంది.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









