ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్ రద్దు
- January 27, 2016
ఎతిహాద్ రైల్ స్టేజ్ 2 టెండర్ ప్రాసెస్ని సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి బిడ్డర్స్ అందరికీ రాతపూర్వకంగా సమాచారం అందించడం జరిగిందని యూఏఈ నేషనల్ రైల్ నెట్వర్క్ డెవలపర్ మరియు ఆపరేటర్ వెల్లడించారు. గ్వెయిఫాత్ వద్ద సౌదీ బోర్డర్ నుంచి అల్ ఎయిన్ వద్ద ఒమన్ బోర్డర్ వరకూ కనెక్ట్ చేసే రైల్ నెట్వర్క్లో భాగంగా ఎతిహాద్ రైల్ స్టేజ్ 2ను ప్లాన్ చేశారు. ముసాఫా, ఖలీఫా పోర్ట్ జెబెల్ అలీ పోర్ట్లను కలిపేలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఎతిహాద్ రైల్ ఇప్పటికే స్టేజ్ వన్ రైల్ నెట్వర్క్ని ప్రారంభించింది. 4 మిలియన్ టన్నుల సల్ఫర్ షా అండ్ హబ్సన్ నుంచి రువాయిస్ పోర్ట్ వరకు అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ కోసం సరఫరా చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో కమర్షియల్ కెపాసిటీని రీచ్ అయితే ఏడు మిలియన్ టన్నుల సల్ఫర్ని ప్రతి సంవత్సరం సరఫరా చేయగలుగుతుంది. మొత్తం మూడు స్టేజ్లలో ఎతిహాద్ రైల్ నెట్వర్క్ని ప్లాన్ చేశారు. ఇది జిసిఇ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం చేయవలసి ఉంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







