అపరిచితులతో జాగ్రత్త: దుబాయ్ స్కూల్ సూచన
- January 27, 2016
దుబాయ్లోని ఓ ప్రైవేటు స్కూల్ తమ విద్యార్థుల తల్లిదండ్రులకు అపరిచితుల విషయమై సూచన చేసింది. పేరెంట్ కమ్యూనిటీకి ఓ లేఖ రాస్తూ, అందులో అపరిచితుల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండేలా తల్లిదండ్రులు తమ పిల్లలకు తగు సూచనలు ఇవ్వాలని పేర్కొంది. విద్యార్థులను స్కూల్లో ఈ విషయమై అప్రమత్తం చేశామనీ, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. స్కూల్ గేట్ వద్ద ఇద్దరు అపరిచితులు విద్యార్థులకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకువెళ్ళారనీ, అదృష్టవశాత్తూ ఎలాంటి హానీ కలగకుండా విద్యార్థులు స్కూల్కి చేరుకున్నారని ఆ స్కూల్ చెప్పింది. పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ, ఎలాంటి ఫిర్యాదులూ తమకు అందలేదని అన్నారు. అయితే విద్యార్థుల భద్రత విషయంలో తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యాలూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







