గవర్నమెంట్‌ సెక్టార్‌లో వలసదారులకు స్థానం కల్పించొద్దు

- January 27, 2016 , by Maagulf
గవర్నమెంట్‌ సెక్టార్‌లో వలసదారులకు స్థానం కల్పించొద్దు


గవర్నమెంట్‌ సెక్టార్‌లో వలసదారులకు స్థానం కల్పించవద్దంటూ ఎంపీ, మినిస్టర్‌ అభిప్రాయపడ్డారు. గుడైబియాలో జరిగి కౌన్సిల్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ సమావేశంలో 'వలసదారులకు గవర్నమెంట్‌ సెక్టార్‌లో అవకాశం' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఎంపీ జలాల్‌ కదీమ్‌ ప్రశ్నకు గవర్నమెంట్‌ సమాధానమిచ్చింది. నాన్‌ బహ్రెయినీలకు పబ్లిక్‌ సెక్టాల్‌లో కల్గించిన అవకాశాల గురించి ప్రస్తావించారు. 99 శాతం గవర్నమెంట్‌ ఉద్యోగాల్లో బహ్రెయినీలకే అవకాశం కల్పించామని మినిస్టర్‌ పేర్కొన్నారు. 600 కంటే తక్కువ మంది వలసదారులు ఇటీవల పబ్లిక్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు పొందారనీ, వీరి శాతం 1 కన్నా తక్కువే ఉంటుందని, 48,000 మంది మొత్తంగా ఈ సెక్టార్‌లో ఉద్యోగులున్నారని చెప్పారు. ఎంపీ ఖదీమ్‌ ఈ సమాధననాన్ని ఖండించారు. 2,000 వలస టీచర్లు గత ఏడాదిలో ఉద్యోగం పొందారనీ, 8,000 మంది మొత్తం ఉన్నారని చెప్పారు. మెడికల్‌ ఉద్యోగాల్లో కూడా వలసదారుల సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు. ఎంపీ ఖదీమ్‌, గంటకు పైగా సమావేశం నుంచి వాకౌట్‌ చేశారని మినిస్టర్‌ సమాధానినికి నిరసనగా ఖదీమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com