గవర్నమెంట్ సెక్టార్లో వలసదారులకు స్థానం కల్పించొద్దు
- January 27, 2016
గవర్నమెంట్ సెక్టార్లో వలసదారులకు స్థానం కల్పించవద్దంటూ ఎంపీ, మినిస్టర్ అభిప్రాయపడ్డారు. గుడైబియాలో జరిగి కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సమావేశంలో 'వలసదారులకు గవర్నమెంట్ సెక్టార్లో అవకాశం' అనే అంశంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఎంపీ జలాల్ కదీమ్ ప్రశ్నకు గవర్నమెంట్ సమాధానమిచ్చింది. నాన్ బహ్రెయినీలకు పబ్లిక్ సెక్టాల్లో కల్గించిన అవకాశాల గురించి ప్రస్తావించారు. 99 శాతం గవర్నమెంట్ ఉద్యోగాల్లో బహ్రెయినీలకే అవకాశం కల్పించామని మినిస్టర్ పేర్కొన్నారు. 600 కంటే తక్కువ మంది వలసదారులు ఇటీవల పబ్లిక్ సెక్టార్లో ఉద్యోగాలు పొందారనీ, వీరి శాతం 1 కన్నా తక్కువే ఉంటుందని, 48,000 మంది మొత్తంగా ఈ సెక్టార్లో ఉద్యోగులున్నారని చెప్పారు. ఎంపీ ఖదీమ్ ఈ సమాధననాన్ని ఖండించారు. 2,000 వలస టీచర్లు గత ఏడాదిలో ఉద్యోగం పొందారనీ, 8,000 మంది మొత్తం ఉన్నారని చెప్పారు. మెడికల్ ఉద్యోగాల్లో కూడా వలసదారుల సంఖ్య పెరిగిందని ఆయన అన్నారు. ఎంపీ ఖదీమ్, గంటకు పైగా సమావేశం నుంచి వాకౌట్ చేశారని మినిస్టర్ సమాధానినికి నిరసనగా ఖదీమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







