'APNRT' ని ప్రారంభించిన ఎపి ముఖ్యమంత్రి
- January 27, 2016
ప్రవాస తెలుగువారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రవాస తెలుగువారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఎన్ఆర్టీ పేరుతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎన్ఆర్టీ వెబ్సైట్, యాప్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగువారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూ ఆయా గ్రామాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని కోరారు.డా.రవి వేమూరి గారు ప్రసంగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కలిసి మెలిసి పనిచేయాలని కోరుకున్నారు.త్వరలో గల్ఫ్ దేశాలు పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులు సుధాకర్ కుదరవల్లి(కువైట్),అనురాధ ఒబ్బిలిశెట్టి(యు.ఎ.ఈ),రాజ శేఖర్(Kuwait NRIs),దివాకర్(TSNV),రెడ్డయ్య చౌదరి(వ్యాపరవేత్త),ప్రసాద్(SkyNet)తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









