'APNRT' ని ప్రారంభించిన ఎపి ముఖ్యమంత్రి
- January 27, 2016
ప్రవాస తెలుగువారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ప్రవాస తెలుగువారిని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ఎన్ఆర్టీ పేరుతో ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎన్ఆర్టీ వెబ్సైట్, యాప్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో ఉన్న ప్రవాస తెలుగువారు సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకుంటూ ఆయా గ్రామాలను అభివృద్ధి చేయడానికి సహకారం అందించాలని కోరారు.డా.రవి వేమూరి గారు ప్రసంగిస్తూ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కలిసి మెలిసి పనిచేయాలని కోరుకున్నారు.త్వరలో గల్ఫ్ దేశాలు పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమములో ప్రవాస భారతీయులు సుధాకర్ కుదరవల్లి(కువైట్),అనురాధ ఒబ్బిలిశెట్టి(యు.ఎ.ఈ),రాజ శేఖర్(Kuwait NRIs),దివాకర్(TSNV),రెడ్డయ్య చౌదరి(వ్యాపరవేత్త),ప్రసాద్(SkyNet)తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)




తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







