కిమ్ మరణించారని పుకార్లు

- April 26, 2020 , by Maagulf
కిమ్ మరణించారని పుకార్లు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జుంగ్ ఉన్ మరణించినట్టు రూమర్లు వస్తున్నాయి. శనివారం కిమ్ చికిత్స పొందుతూ మరణించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఉత్తరకొరియా కూడా ఈ వార్తలపై ఎటువంటి వివరణా ఇవ్వలేదు. అసలు కిమ్ ఆసుపత్రిలో ఉన్నాడా లేక ఇంకా ఎక్కడైనా వున్నాడా అనే విషయం తెలియకపోయినప్పటికీ ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స చేయించుకొని ఆరోగ్యాంగా వున్నారని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15వ తేదీన ఉత్తరకొరియా ఆవిర్భావ దినోత్సవం. ఉత్తరకొరియా దేశాన్ని ఏర్పాటు చేసింది స్వయానా కిమ్ తాత. ఆ వేడుకను అత్యంత ఘనంగా, ఆడంబరంగా నిర్వహిస్తారు. అలాంటి ఈవెంట్ కి కిమ్ హాజరు కాలేదు. దీనికి కారణం ఆయన అనారోగ్యానికి గురవ్వడమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com