వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- July 09, 2026
అబుదాబి: వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా మాజీ సహోద్యోగినిని దూషించిన కేసులో ఓ మహిళకు అబుదాబి క్రిమినల్ కోర్టు 30 వేల దిర్హమ్లు (Dh30,000) జరిమానా విధించింది. అంతేకాకుండా బాధితురాలికి తాత్కాలిక పరిహారంగా21 వేల దిర్హమ్లు (Dh21,000) చెల్లించాలని కూడా ఆదేశించింది. కోర్టు తీర్పు ప్రకారం, బాధితురాలు పలుమార్లు వచ్చిన ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితురాలు వాట్సాప్లో అసభ్య పదజాలంతో కూడిన వాయిస్ మెసేజ్ పంపింది. కొన్ని సెకన్ల నిడివి ఉన్న ఆ ఆడియోనే కేసులో కీలక సాక్ష్యంగా పరిగణించారు.
విచారణ సందర్భంగా నిందితురాలు తాను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని, ఫోన్ ఎత్తకపోవడంతో కోపంలో ఆ వాయిస్ మెసేజ్ పంపానని, తమ మధ్య చాలా కాలంగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.అయితే వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనే కారణంతో చట్టం మినహాయింపు ఇవ్వదని కోర్టు స్పష్టం చేసింది. డిజిటల్ మాధ్యమాల ద్వారా నమోదైన స్పష్టమైన దూషణలు యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం నేరంగానే పరిగణిస్తామని పేర్కొంది.
ఈ తీర్పు ద్వారా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లలో క్షణిక ఆవేశంతో పంపే సందేశాలు కూడా తీవ్రమైన చట్టపరమైన, ఆర్థిక పరిణామాలకు దారితీస్తాయని కోర్టు హెచ్చరించింది. డిజిటల్ కమ్యూనికేషన్లో మర్యాద పాటించాలని, ఆన్లైన్లో పంపిన సందేశాలు సైబర్ నేరాల విచారణలో కీలక సాక్ష్యాలుగా మారవచ్చని యూఏఈ అధికారులు మరోసారి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







