యూఏఈ: కార్మికులకు సిమ్ కార్డులు, కరోనా సెఫ్టి బాక్సుల పంపిణి

- May 02, 2020 , by Maagulf
యూఏఈ: కార్మికులకు సిమ్ కార్డులు, కరోనా సెఫ్టి బాక్సుల పంపిణి

యూఏఈ:అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా యూఏఈ కార్మికు భద్రత కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య భద్రతను పాటిస్తూ మహమ్మారిపై పోరాటంలో భాగస్వామ్యులు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా కార్మికులకు మే డే రోజున స్టే సేఫ్ కాన్సెప్ట్ తో సెఫ్టి బాక్స్ లను కానుకగా ఇచ్చింది. ఇందులో కరోనా వైరస్ సోకకుండా ధరించే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్స్ తో పాటు ఆహార పదార్ధాలు..ఇలా మొత్తం 44 రకాల వస్తువులు అందించింది యూఏఈ. అలాగే కార్మికులు కుటుంబ సభ్యులతో మాట్లాడి మానసికంగా సంతోషకరమైన జీవితం గడిపటం కోసం ఉచితంగా సిమ్ కార్డులను కూడా అందించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com