కరోనాపై పోరులో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన కువైట్ రాయబారి
- May 02, 2020
కువైట్:కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటంలో కువైట్ కు చేదోడుగా నిలిచిన భారత ప్రభుత్వానికి కువైట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని కువైట్ రాయబారి హెచ్ఈ జెస్సెమ్ అల్ నజెం ఓ ప్రకటన విడుదల చేశారు. కువైట్ కు 15 మందితో కూడిన మెడికల్ టీంను పంపటంతో పాటు రెండు టన్నుల మెడికల్ పరికరాలను పంపి భారత్ తన ఉదారతను చాటుకుందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కువైట్ చేస్తున్న పోరాటానికి పలు రకాలుగా సాహాయ పడుతున్న మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇంకా భారత్ తన సాయం కొనసాగిస్తోందని, పారాసిటమాల్ మాత్రలతో పాటు ఆహారపదార్దాలను కువైట్ కు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్ చిక్కుకుపోయిన కువైట్ పౌరులను స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే కువైట్ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారని, క్షమాభిక్ష పథకం కింద ఒక్క పైసా ఖర్చు లేకుండా వారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్నామని అన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







