కరోనాపై పోరులో సహకరించిన భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన కువైట్ రాయబారి
- May 02, 2020
కువైట్:కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొవటంలో కువైట్ కు చేదోడుగా నిలిచిన భారత ప్రభుత్వానికి కువైట్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని కువైట్ రాయబారి హెచ్ఈ జెస్సెమ్ అల్ నజెం ఓ ప్రకటన విడుదల చేశారు. కువైట్ కు 15 మందితో కూడిన మెడికల్ టీంను పంపటంతో పాటు రెండు టన్నుల మెడికల్ పరికరాలను పంపి భారత్ తన ఉదారతను చాటుకుందని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కువైట్ చేస్తున్న పోరాటానికి పలు రకాలుగా సాహాయ పడుతున్న మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇంకా భారత్ తన సాయం కొనసాగిస్తోందని, పారాసిటమాల్ మాత్రలతో పాటు ఆహారపదార్దాలను కువైట్ కు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భారత్ చిక్కుకుపోయిన కువైట్ పౌరులను స్వదేశానికి తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలాఉంటే కువైట్ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులకు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారని, క్షమాభిక్ష పథకం కింద ఒక్క పైసా ఖర్చు లేకుండా వారిని వారి సొంత దేశాలకు తరలిస్తున్నామని అన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!