భారత్:మరోసారి పెరిగిన పాజిటివ్ కేసులు
- May 02, 2020
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతం అవుతోంది. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 39 వేల 242 కు పెరిగింది. శనివారం మహారాష్ట్రలో 790, గుజరాత్లో 333, ఉత్తరప్రదేశ్లో 159, పంజాబ్లో 187, మధ్యప్రదేశ్లో 73 సహా 1900 కి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి.
దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య http://covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం 39,294 ఉండగా.. అందులో 10,566మందికి నయమైంది.. మొత్తం1223 మంది మరణించారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో గరిష్టంగా 1061 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 26.65% కి పెరిగింది. ప్రస్తుతం 37 వేల 776 మంది సోకినవారు ఉన్నారు. 26 వేల 535 మంది చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







