వైట్ హౌస్ లో రెండో కరోనా కేసు
- May 09, 2020
అమెరికా దేశ అధ్యక్షుడి అధికార నివాసమైన శ్వేతసౌధంలో రెండో కరోనా కేసు నమోదైంది. అమెరికా ఉపాధ్యక్షుడి సహాయకురాలికి కరోనా వైరస్ సోకిందని తేలటంతో ఆ దేశంలో సంచలనం రేపింది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న కేటీ మిల్లర్కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని.. అక్కడి అధికారులు వెల్లడించారు. గతంలో కూడా వైట్హౌస్లో ఓ అధికారికి కరోనా వైరస్ సోకింది. అయితే, అప్పట్లో కరోనా సోకిన అధికారి పేరు వెల్లడించలేదు. కేటీ మిల్లర్ అనే యువతికి గతంలో ఒకసారి పరీక్షలు చేసినా.. నెగెటివ్ వచ్చిందని.. కానీ, కరోనా సోకినట్టు తేలిందని ట్రంప్ తెలిపారు. కేటీ మిల్లర్ తో తాను కలవలేదని, ఆమె ఉద్యోగరీత్యా ఉపాధ్యక్షుడితో కలుస్తుంటారని ట్రంప్ చెప్పారు. దీంతో అమెరికాలో ఆందోళన మొదలైంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







