కువైట్:కరోనా డాక్టర్ మృతి..సంతాపం ప్రకటించిన ఆరోగ్యశాఖ మంత్రి
- May 09, 2020
కువైట్:కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ కువైట్ లో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయారు. ఈజిప్ట్ కు చెందిన డాక్టర్ తారీక్ హుస్సేన్ ముఖైమర్ కువైట్ జైన్ ఆస్పత్రిలోని ఈఎన్టీ విభాగంలో విధులు నిర్వహించేవారు. కొద్ది రోజులుగా కరోనా విభాగంలో సేవలు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్ కూడా వైరస్ బారిన పడటంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కరోనా కారణంగా కువైట్ లో కన్నుమూసిన తొలి డాక్టర్ ఇతనే. డాక్టర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ షేక్ బాసిల్ అల్ సాబా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ తారీక్ మృతి పట్ల కువైట్ లోని ఈజిప్ట్ రాయబారి తరెక్ ఎల్ ఖువౌని డాక్టర్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కరోనా బాధితులకు సేవ చేస్తూ ప్రాణాలు త్యాగం చేసిన డాక్టర్ తారీక్ సేవలను కొనియాడారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







