భారత్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు..
- May 10, 2020
ఢిల్లీ:అగ్ర రాజ్యాలతో పోలిస్తే భారత్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉందని అనుకుంటున్న తరుణంలో దేశంలో కూడా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు చూసిన లెక్క ఒక ఎత్తైతే శనివారం ఒక్కరోజే దేశంలో 3277 కేసులు నమోదు కావడంతో పాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 2109కి చేరగా మొత్తం బాధితుల సంఖ్య 62,939గా నమోదైంది. మొత్తం కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 19,358 కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, మరో 41,472 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజుకు వెయ్యి కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ముంబై నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 12 వేలు దాటగా పుణెలో 2,700 కేసులు నమోదయ్యాయి. తరువాతి స్థానాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్లో మరణాల రేటు అధిక స్థాయిలో ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడులో వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







