బహ్రెయిన్:వ్యక్తిగత తగాదాలతో సోదరుడిపై దాడి..మూడో అంతస్తుపై నుంచి నెట్టివేత

- May 12, 2020 , by Maagulf
బహ్రెయిన్:వ్యక్తిగత తగాదాలతో సోదరుడిపై దాడి..మూడో అంతస్తుపై నుంచి నెట్టివేత

మనామా:మూడో అంతస్తు నుంచి వ్యక్తిని తోసివేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. సోదరుల మధ్య తలెత్తిన వ్యక్తిగత వివాదంలో ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని మూడో అంతస్తు నుంచి తోసివేశారనే ఆరోపణలతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అయితే..బాధితుడు గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో బాధితుడితో ఉన్న అతని స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం..తాము తమ ఫ్లాట్ లో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బలవంతంగా తమ ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చారని, వాళ్లు అప్పటికే మద్యం మత్తులో ఉన్నట్లు అతను చెబుతున్నాడు. ఫ్లాట్ లోకి చొచ్చుకొచ్చిన వెంటనే దాడికి ప్రయత్నించటంతో బాధితుడు పై అంతస్తులోకి పారిపోయాడని..అతనిని వెంబడించిన నిందితులు మూడో ఫ్లోర్ కు చేరుకోగానే అక్కడి నుంచి అతన్ని కిందకు తోసివేసినట్లు చెబుతున్నాడు. అంతేకాదు..దాడి జరిగిన సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు కూడా వెల్లడించాడు. దాడికి పాల్పడిన వారిలో ఒకరు బాధితుడికి సోదరుడని..ఆస్తి తగాదా విషయంలో దాడి జరిగినట్లు వెల్లడించాడు. బాధితుడి స్నేహితుడి ఫిర్యాదుతో నిందితులు ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి న్యాయవిచారణకు సిఫార్సు చేశారు. ఈ కేసులో ఈ నెల 31న క్రిమినల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com