తెలంగాణ:మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- May 14, 2020
హైదరాబాద్:తెలంగాణలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.. తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం... గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,414 చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 428 మంది యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొన్నారు అధికారులు.. ఇక, ఇవాళ 13 మందిని డిశ్చార్జ్ చేయగా.. డిశ్చార్జి అయినవారి సంఖ్య 952కి చేరింది.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 34 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది.. ఇవాళ ఒకే రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 40 కొత్త కేసులు వెలుగు చూడగా.. రంగారెడ్డి జిల్లాలో ఐదు కేసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఇద్దరికి.. మొత్తంగా 47 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







