తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు

- May 17, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 42 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే నమోదయ్యాయి. GHMC పరిధిలో 37 మందికి, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి, ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,551 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం 21 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వీరితో కలుపుకుని  ఇప్పటివరకు మొత్తం 992 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 57 మంది వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. 525 మందికి చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com