సౌదీ మసీదుపై దాడిని ఖండించిన యూఏఈ
- January 29, 2016
సౌదీ మసీదుపై దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది యూఏఈ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యూఏఈ మద్దతు ఎప్పుడూ ఉంటుందని యూఏఈ అధికారికవర్గాలు వెల్లడించాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద దాడులు అత్యంత హేయమనీ, పిరికితనంతో కూడిన ఇలాంటి చర్యలు సమర్థనీయం కావని యూఏఈ చెప్పింది. అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి ఉందని సంఘీభావ ప్రకటనలో పేర్కొంది యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సౌదీ ప్రభుత్వానికీ, బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది యూఏఈ.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







