సౌదీ మసీదుపై దాడిని ఖండించిన యూఏఈ
- January 29, 2016
సౌదీ మసీదుపై దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది యూఏఈ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో యూఏఈ మద్దతు ఎప్పుడూ ఉంటుందని యూఏఈ అధికారికవర్గాలు వెల్లడించాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తీవ్రవాద దాడులు అత్యంత హేయమనీ, పిరికితనంతో కూడిన ఇలాంటి చర్యలు సమర్థనీయం కావని యూఏఈ చెప్పింది. అంతర్జాతీయ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి ఉందని సంఘీభావ ప్రకటనలో పేర్కొంది యూఏఈ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సౌదీ ప్రభుత్వానికీ, బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది యూఏఈ.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









