ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

- May 20, 2020 , by Maagulf
ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. తాజా కేసులతో ఏపీలో 24 వందలు దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68 కొత్త కేసులు నమోదు అయ్యాయి..ఒకరు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన 68 పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్‌ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com