ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
- May 20, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. తాజా కేసులతో ఏపీలో 24 వందలు దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68 కొత్త కేసులు నమోదు అయ్యాయి..ఒకరు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన 68 పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







