ఏ.పి:గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు
- May 20, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే వున్నాయి. తాజా కేసులతో ఏపీలో 24 వందలు దాటాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ సర్కార్ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68 కొత్త కేసులు నమోదు అయ్యాయి..ఒకరు మృతిచెందారు.. దీంతో.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,407కు చేరగా.. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 53 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 9,159 శాంపిల్స్ పరీక్షించినట్టు పేర్కొంది ప్రభుత్వం.. కొత్తగా వచ్చిన 68 పాజిటివ్ కేసుల్లో చిత్తూరులో 6, నెల్లూరులో 4 కేసులకు కేయంబేడు లింక్ ఉన్నట్టు తేలడంతో.. ఆయా జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







