తెలంగాణ:కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం
- May 29, 2020
తెలంగాణ:కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతల ద్వారా కొండపోచమ్మ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి కలిసి సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. మర్కూక్ పంప్హౌస్ వద్ద మోటార్ స్వీచ్లను ఆన్ చేయడంతో నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా గంగపూజ నిర్వహించి గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. చండీ, సుదర్శన హోమాల కలశ జలాలను కొండపోచమ్మ రిజర్వాయర్లో కలిపారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతఘట్టం ఆవిషృతమైంది.
దీంతో ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో 10వ దశ ఎత్తిపోతలు పూర్తి అయ్యాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నాలుగవ లింక్ 14వ ప్యాకేజీలో భాగంగా దీన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో ఇది ఉంటుంది. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ యాదాద్రి జిల్లాల రైతులకు సాగునీరు అందనుంది. దీంతో ఆయా జిల్లాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతకు ముందు సీఎం కేసీఆర్ దంపతులు కొండపోచమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు,ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







