177 మంది బాలికల కోసం విమానం ఏర్పాటు చేసిన సోను సూద్
- May 29, 2020
కేరళ:వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేసి అందరి అభిమానం అందుకుంటున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ అక్కడితో తన సహాయాన్ని ఆపలేదు. ప్రతి రోజూ వలస కూలీలకు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే ఉన్నారు. ఒక్క వలస కూలీలనే కాదు తన సహాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారు. తాజాగా కేరళలో చిక్కుకున్న 177 మంది బాలికలను విమానంలో వారి రాష్ట్రానికి పంపించారు. ఈ అమ్మాయిలంతా కేరళలోని ఓ కుట్టు మిషన్ కర్మాగారంలో పని చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. దాంతో వారంతా అక్కడే చిక్కుకుపోయారు. సోనూ స్నేహితుడొకరు ఈ విషయాన్ని ఆయనకు చేరవేశారు. దాంతో వెంటనే సోనూ ఆ అమ్మాయిలందరికీ సహాయం చేయదలచి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాలు నడపడానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. ఒక ప్రత్యేక విమానంలో వారిని కొచ్చి నుండి భువనేశ్వర్ చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వారు తమ ఇళ్లకు చేరుకుంటారు. సోనూ సూద్ సహాయం పొందిన ఓ గర్భిణీ తన కొడుక్కి సోనూ సూద్ శ్రీవాత్సవ అని పెట్టుకుంది. ఆ విషయం తెలిసి సోనూ తన హృదయం ఉప్పొంగి పోయిందన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







