ఏ.పిలో పెరిగిన కరోనా కేసులు..

- June 01, 2020 , by Maagulf
ఏ.పిలో పెరిగిన కరోనా కేసులు..

అమరావతి:ఆంధ్రపదేశ్‌లో కొత్తగా గత 24 గంటల్లో కొత్తగా 104 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏ.పికి చెందినవి 76 కాగా.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

తాజాగా.. నమోదైన కేసులతో కలిపితే ఏ.పిలో మొత్తం కేసుల సంఖ్య 3,118కి చేరింది. గత 24గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 64మంది మృతి చెందారు. కొత్తగా 34మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకూ ఏ.పిలో మొత్తం 2,169 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 885 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com