తెలంగాణ వాసి మృతి ఆదుకున్న తెలంగాణ జాగృతి కువైట్

- June 01, 2020 , by Maagulf
తెలంగాణ వాసి మృతి ఆదుకున్న తెలంగాణ జాగృతి కువైట్

కువైట్ సిటీ:కువైట్ లో గుండెపోటుతో  మరణించిన గల్ఫన్న...మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అండగా నిలిచిన తెలంగాణ జాగృతి కువైట్.
తెలంగాణ రాష్ట్రం,జగిత్యాల జిల్లా,  గంభీర్ పూర్ గ్రామానికి చెందిన గంగాధర్  పబ్బా(44) అనే కార్మికుడు గుండెపోటుతో  గత  రెండు వారాలక్రితం మరణించడం జరిగింది. ఈ విషయాన్ని మృతుని భందువులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత  దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కువైట్ లో ఉంటున్నా తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ ముత్యాల వినయ్ కి సమాచారం అందించడం జరిగింది. కువైట్ లో కర్ఫ్యూ ఉన్నందువల్ల ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో పార్థివ దేహాన్ని పంపిస్తానని మృతుని బంధువులకు ముత్యాల వినయ్ హామీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి  కువైట్ జనరల్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క లాక్ డౌన్ అయినప్పటికీ సేవా దృక్పథంతో. ఇండియన్ ఎంబసీ లో డాక్యుమెంటేషన్, కువైట్ గవర్నమెంట్ డాక్యుమెంటేషన్ మరియు పోలీస్ క్లియరెన్స్ ప్రాసెస్ పూర్తి చేశారు.అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్టు నుండి వారి స్వగ్రామం వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. ఈరోజు(01/06/2020) పార్థివదేహాన్ని తన స్వగృహానికి చేర్చడం జరిగింది.
కువైట్ తరుపున జాగృతి అధ్యక్షులు ముత్యాల విజయ్ కుమార్ మరియు వారి కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటామని ఎటువంటి అవసరాలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com