తెలంగాణలో 10 కరోనా మరణాలు

- June 06, 2020 , by Maagulf
తెలంగాణలో 10 కరోనా మరణాలు

హైదరాబాద్:తెలంగాణ లో గడిచిన గంటల్లో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 3496కు పెరిగింది. అలాగే, ఒక్కరోజే 10 మంది మృతిచెందారు.ఈరోజు నమోదైన కేసుల్లో 152 కేసులు కేవలం GHMC పరిధిలోనే నమోదయ్యాయి.ఈరోజు చనిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 123కు పెరిగింది.తెలంగాణలో మొత్తం 1,710 మంది డిశ్చార్జ్‌ కాగా 1,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి 10, మేడ్చల్‌ 18, నిర్మల్‌ 5, యాదాద్రి 5, మహబూబ్‌నగర్‌లో 4 కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు జగిత్యాల, నాగర్‌కర్నూల్‌లో రెండేసి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మహబూబాబాద్‌, వికారాబాద్‌, జనగాం, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాలలో ఒక్కో కరోనా కేసు నమోదు అయినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com