అబుధాబి:మాస్కులను బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే Dh1,000 ఫైన్..6 బ్లాక్ పాయింట్స్
- June 07, 2020
అబుధాబి:కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఫేస్ మాస్క్ లపై ఫోకస్ చేశారు అబుధాబి పోలీసులు. చాలామంది వాహనదారులు వాడిన ఫేస్ మాస్కులను రోడ్డుపక్కన పడేసి వెళ్తున్నట్లు తాము గమనించామని వెల్లడించారు. ఇక నుంచి ఎవరైనా మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే..వారికి Dh1,000 జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. వాడి పారేసిన ఫేస్ మాస్కుల కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, వైరస్ నియంత్రించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని అబుధాబి పోలీసులు వెల్లడించారు. మాస్కులను ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి..వాటి డస్ట్ బిన్ లో మాత్రమే పడేయాలని కూడా సూచించారు. ఇదిలాఉంటే..వారం రోజుల క్రితం అజ్మన్ పోలీసులు కూడా తమ పరిధిలో ఫేస్ మాస్కులను పడేయటంపై నిషేధం విధించింది. జూన్ 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఫేస్ మాస్కులు బహిరంగ ప్రదేశాల్లో పడేస్తే Dh1,000 జరిమానా, 6 బ్లాక్ పాయింట్ల విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు అదే నిబంధనలను అబుధాబి పోలీసులు కూడా అమలు చేస్తున్నారు. దీంతో ఫేస్ మాస్కులపై ఈ కొత్త నిబంధనలను దేశమంతా వర్తింపచేస్తారా? అందులో భాగంగానే ముందస్తుగా అజ్మన్, అబుధాబి ఎమిరాతి పరిధిలో అమలులోకి తీసుకొచ్చారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







