తెలంగాణలో 154 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 07, 2020 , by Maagulf
తెలంగాణలో 154 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గరిష్టంగా 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 3,650కు చేరింది.మొత్తంగా 137 మంది ప్రాణాలు కోల్పోగా,  1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 132 GHMCలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com