నెక్ట్స్ ఫిల్మ్ కోసం సోషల్ మీడియాలో లైవ్ ఆడిషన్ నిర్వహించనున్న డైరెక్టర్ తేజ
- June 10, 2020
డైరెక్టర్ తేజ తన తర్వాతి సినిమాతో ప్రతిభావంతులైన నటులను పరిచయం చేయనున్నారు. దీని కోసం టాలీవుడ్లోనే మొట్టమొదటి సారిగా, సోషల్ మీడియా వేదిక ద్వారా ఆడిషన్ నిర్వహించనుండటం విశేషం. టాలీవుడ్కు ప్రతిభావంతుల్ని పరిచయం చేసే ఈ అవకాశాన్ని హలో యాప్ చేజిక్కించుకుంది. హలో యాప్లో అప్లోడ్ చేసిన అప్లికేషన్లను మాత్రమే ఫైనల్ ఆడిషన్ కోసం పరిగణనలోకి తీసుకుంటామని తేజ స్పష్టం చేశారు.
ప్రతిష్ఠాత్మక బ్యానర్లు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. తన బర్త్డే సందర్భంగా రెండు చిత్రాల్ని దర్శకుడు తేజ అనౌన్స్ చేశారు. వాటిలో ఒకటి రానా దగ్గుబాటితో తీసే 'రాక్షసరాజు రావణాసురుడు' సినిమా కాగా, మరొకటి గోపీచంద్తో రూపొందించనున్న 'అలిమేలుమంగ వేంకటరమణ' చిత్రం.
ఈ రెండింటిలో ఏ సినిమా కోసం ఈ ఆడిషన్స్ను నిర్వహించనున్నారనే విషయాన్ని త్వరలో వెల్లడి చేస్తారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







