ఎగుమతి దిగుమతులు: చమురు-శ్రామికశక్తి
- January 31, 2016
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఏ పరిణామమైనా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవలి కాలంలో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు తగ్గుముఖం పడుతుండటం వలన గల్ఫ్ దేశాల ఎగుమతి వ్యాపారంలో లాభాలు క్షీనిస్తున్నాయి. తగ్గిన ఆదాయాన్ని పూడ్చుకోవడానికి జి.సి.సి.(గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ - గల్ఫ్ సహకార మండలి) దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, ఖతార్, కువైట్, బహరేన్ వారు ప్రత్నామ్యాయ మార్గాలను వెతుకుతున్నారు, వ్యయాలు తగ్గిచుకోవడంతోపాటు, పన్నులు విధించే యోచనలో ఉన్నారు.
సుమారు 60 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి ద్వారా భారత్ కు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభిస్తున్నది. చమురు ధరల పతనం భారత్ మీద కొన్ని ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉన్నది. వీరు పంపే డబ్బు తగ్గి విదేశీ మారక ద్రవ్య నిల్వలు పడిపోవచ్చు. ఈ దేశాలలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా సన్నగిల్లుతాయి.
భారత్ తన శ్రామికశక్తిని (కార్మికులను) గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల పేరిట ఎగుమతి చేసి తద్వారా వారు నెలనెలా పంపే విదేశీమారక ద్రవ్యాన్ని ఉపయోగించుకొని అదే గల్ఫ్ దేశాలనుండి చమురును దిగుమతి చేసుకుంటున్నది. ఇది పక్కా 'ఎగుమతి - దిగుమతి' వ్యాపారం, ఇందులో ఇరు పక్షాలు లాభాపడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు శ్రామికులు అవసరం, భారత్ కు చమురు అవసరం.
గల్ఫ్ దేశాలలో ఉన్నభారతీయుల ఉద్యోగాలు ఊడకుండా ఉండాలంటే, కొత్తవారికి గల్ఫ్ లో ఉద్యోగాలు రావాలంటే భారత ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపుతూ తగిన చర్యలు తీసుకోవాలి. కార్మికులు, ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ తగిన పొదుపు చర్యలు తీసుకోవాలి. ఆకస్మికంగా ఉద్యోగంపొతే ఏంచేయాలో ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే యువత భారత ప్రభుత్వం చేపట్టిన 'కౌశల్ వికాస్ యోజన' పథకంలో ఉచితంగా నైపుణ్య శిక్షణ పొందవచ్చు. నిర్మాణ రంగానికి సంబంధించి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు 'నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ ' (ఎన్.ఎ.సి) లో హాస్టల్ వసతితో సహా ఉచిత శిక్షణ పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగినవారికి ఉపాధి అవకాశంలో ముందుంటారు.
-- మంద భీంరెడ్డి, ఎడిటర్, 'ప్రవాసి మిత్ర'
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







