దుబాయ్ ఎయిర్పోర్ట్ మళ్ళీ నెంబర్ వన్
- February 01, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరోమారు ప్రపంచంలోనే నెంబర్ వన్ హబ్ ఫర్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్గా నిలిచింది. 2015లో 78 మిలియన్ ప్రయాణీకులతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిత్యం రద్దీగా కనిపించింది. 100కి పైగా ఎయిర్లైన్స్, 240కి పైగా డెస్టినేషన్స్తో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణీకులకు సేవలందిస్తోంది. 2014లో 70,473,893 ప్రయాణీకులకు సేవలందించిన ఈ ఎయిర్పోర్ట్, 2015లో 10.7 శాతం అదనంగా అంటే 78,014,838 మంది ప్రయాణీకులకు సేవలందించింది. ఎయిర్క్రాఫ్ట్స్ మూమెంట్ పరంగా చూస్తే, 2014లో 353,507 ఉంటే, 2015లో 403,517గా నమోదైంది. సింగిల్ లార్జెస్ట్ డెస్టినేషన్ విభాగంలో ఇండియా నిలిచింది. 2015లో 10,391,376 మంది ప్రయాణీకులు ఇండియాకి వెళ్ళారు. గత ఏడాదితో పోల్చితే ఇది 17 శాతం అదనం. యూకే డెస్టినేషన్ విభాగంలో రెండో స్థానం దక్కించుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







