మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది
- February 01, 2016
ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. వాట్సాప్ సహ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ లను అభినందించారు. 2014లో ఫేస్ బుక్ యాజమాన్యం వాట్సాప్ ను సొంతం చేసుకున్నాక యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ రెండేళ్లలోపే వాట్సాప్ యూజర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం.'ఫేస్ బుక్ లో చేరాక వాట్సాప్ యూజర్లు రెట్టింపుకంటే ఎక్కువయ్యారు. వాట్సాప్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. మా తర్వాతి లక్ష్యం ఈ సర్వీసును వ్యాపారంతో అనుసంధానిస్తాం' అని జూకర్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.'ప్రతినెలా ప్రపంచంలో ఏడుగురిలో ఒకరు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమాచారం పంచుకుంటున్నారు. జాతీయ విపత్తులు, ఆరోగ్య సమస్యలు మొదలు శుభకార్యాలు, వ్యాపారాల వరకు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు' అని వాట్సాప్ టీమ్ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







