మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది

- February 01, 2016 , by Maagulf
మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది

ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ కొత్త మైలురాయిని చేరుకుంది. వాట్సాప్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయాన్ని ప్రకటించారు. వాట్సాప్ సహ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ లను అభినందించారు. 2014లో ఫేస్ బుక్ యాజమాన్యం వాట్సాప్ ను సొంతం చేసుకున్నాక యూజర్లు గణనీయంగా పెరిగారు. ఈ రెండేళ్లలోపే వాట్సాప్ యూజర్ల సంఖ్య రెట్టింపు కావడం విశేషం.'ఫేస్ బుక్ లో చేరాక వాట్సాప్ యూజర్లు రెట్టింపుకంటే ఎక్కువయ్యారు. వాట్సాప్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మరింతమందికి సేవలందించేందుకు కృషి చేస్తున్నాం. మా తర్వాతి లక్ష్యం ఈ సర్వీసును వ్యాపారంతో అనుసంధానిస్తాం' అని జూకర్ బర్గ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.'ప్రతినెలా ప్రపంచంలో ఏడుగురిలో ఒకరు వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రేమికులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమాచారం పంచుకుంటున్నారు. జాతీయ విపత్తులు, ఆరోగ్య సమస్యలు మొదలు శుభకార్యాలు, వ్యాపారాల వరకు సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు' అని వాట్సాప్ టీమ్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com