మస్కట్:విమాన ప్రయాణికులకు 4 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి..
- June 28, 2020మస్కట్:కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఒమన్ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. త్వరలోనే కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం..ఇక నుంచి ప్రయాణికులు అందరూ ఫ్లైట్ టైంకి 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒమన్ లోని విమానాశ్రయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు వీలైనంత వరకు ప్రయాణానికి అవసరమయ్యే ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేసుకోవాలని కోరింది. అలాగే టికెట్ల కొనుగోళ్లలోనూ ఈ-టికెట్లకే ప్రధాన్యత ఇవ్వాలంది. ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎయిర్ట్ పోర్ట్ టెర్మినల్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా మాస్కులు ధరించే ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే విమానాశ్రయానికి రావొద్దని కోరింది. అలాంటి వారు వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..