మస్కట్:విమాన ప్రయాణికులకు 4 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి..
- June 28, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఒమన్ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. త్వరలోనే కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం..ఇక నుంచి ప్రయాణికులు అందరూ ఫ్లైట్ టైంకి 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒమన్ లోని విమానాశ్రయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు వీలైనంత వరకు ప్రయాణానికి అవసరమయ్యే ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేసుకోవాలని కోరింది. అలాగే టికెట్ల కొనుగోళ్లలోనూ ఈ-టికెట్లకే ప్రధాన్యత ఇవ్వాలంది. ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎయిర్ట్ పోర్ట్ టెర్మినల్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా మాస్కులు ధరించే ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే విమానాశ్రయానికి రావొద్దని కోరింది. అలాంటి వారు వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?