మస్కట్:విమాన ప్రయాణికులకు 4 గంటల ముందే ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి..
- June 28, 2020
మస్కట్:కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఒమన్ ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. త్వరలోనే కమర్షియల్ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం..ఇక నుంచి ప్రయాణికులు అందరూ ఫ్లైట్ టైంకి 4 గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని సూచించింది. ఈ మేరకు ఒమన్ లోని విమానాశ్రయాలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు వీలైనంత వరకు ప్రయాణానికి అవసరమయ్యే ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేసుకోవాలని కోరింది. అలాగే టికెట్ల కొనుగోళ్లలోనూ ఈ-టికెట్లకే ప్రధాన్యత ఇవ్వాలంది. ప్రయాణికులు తమ వెంట ఒకే ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చేందుకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఎయిర్ట్ పోర్ట్ టెర్మినల్ లో ఉన్నంత సేపు ఖచ్చితంగా మాస్కులు ధరించే ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే విమానాశ్రయానికి రావొద్దని కోరింది. అలాంటి వారు వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







