షార్జా:కనీస వసతులు లేకుండా కష్టాల్లో భారత కార్మికులు..ఆదుకున్న ఇండియన్ అసోసియేషన్
- June 28, 2020
షార్జా:కరోనా నేపథ్యంలో కనీస వసతులు కూడా లెకుండా కష్టాలు పడుతున్న భారత కార్మికులను షార్జా పోలీసులు, కార్మిక శాఖ, ఇండియన్ అసోసియేషన్ షార్జా ప్రతినిధులు ఆదుకున్నారు. ఓ భవన నిర్మాణ ప్రాంతంలో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది కార్మికులను అక్కడి నుంచి తరలించారు. కార్మికులు పని చేసే చోట కనీసం ఆహారం కూడా సరిగ్గా అందలేదు. అంతేకాదు..మండే ఎండలో వారికి ఏసీ ఏర్పాటు చేయలేదు. టాయిలెట్స్ సౌకర్యం కూడా లేదు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో అంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాలు పడుతున్న కార్మికుల గురించి తెలుసుకున్న టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వీ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ సదత్ సౌదాగర్ చొరవ తీసుకున్నారు. వీరితో పాటు..ఇండియన్ అసోసియేషన్ షార్జా అధ్యక్షుడు ఈ.పీ. జాన్సన్, యాక్టీవ్ ట్రెజరర్ షాజీ జాన్, ఐఏఎస్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు అహ్మద్ షిబ్లి సాయంతో నిర్మాణ ప్రదేశంలో చిక్కుకుపోయిన 300 మంది కార్మికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. షార్జా ఇండియన్ స్కూల్, షార్జా పోలీసులు భారత కార్మికులను తరలించేందుకు 13 బస్సులను ఏర్పాటు చేసింది.



తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







