బహ్రెయిన్:ఫేస్ మాస్క్ ఉల్లంఘనలు 6,128
- June 29, 2020మనామా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ హమాద్ బిన్ ముహమ్మద్ అల్ ఖలీఫా వెల్లడించిన వివరాల ప్రకారం, ఫేస్ మాస్క్లు ధరించాలన్న రూల్ని 6128 మంది ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. పోలీస్ డైరెక్టరేట్ - నార్తరన్ గవర్నరేట్ 2000 ఉల్లంఘనల్ని రికార్డ్ చేయగా, క్యాపిటల్ గవర్నరేట్లో 1,265 ఉల్లంఘనలు నమోదయ్యాయి. ముహరాక్ గవర్నరేట్లో 1,201 ఉల్లంఘనలు, సదరన్ గవర్నరేట్లో 979 ఉల్లంఘనలు నమోదయ్యాయి. జనరల్ సెక్యూరిటీ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ 611 కేసులు నమోదు చేయగా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ 72 కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసిన విషయం విదితమే.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!