కరోనా ఇప్పట్లో వదలదు:WHO
- June 30, 2020జెనీవా:కరోనా వైరస్ మన జీవితాల్లోకి వచ్చి ఆరు నెలలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. 5 లక్షమంది మహమ్మారి బారిన పడి మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో కొన్ని దేశాలు పురోగతిని సాధించినా.. భయంకరమైన వాస్తవం ఏమిటంటే.. ఈ వైరస్ ప్రభావం ఇప్పట్లో ముగియదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసన్ స్పష్టం చేశారు. వైరస్ను ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రయత్నం కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం లేదని డబ్ల్యుహెచ్ఓ అత్యవసర విభాగాధిపతి మైక్ రేయాన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో చేయగలిగింది ఒక్కటే.. వైరస్ సోకిన వారిని గుర్తించడం.. వారితో సన్నిహితంగా మెలిగిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వంటి చర్యల ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని రేయాన్ సూచించారు. ఈ విధానాన్ని అనుసరిస్తూ వ్యాప్తిని కొంత నిరోధించిన దేశాలు జపాన్, దక్షిణ కొరియాలను ఉదాహరణగా చూపించారు.
తాజా వార్తలు
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!