భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- May 10, 2024
మదీనా: సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో గురువారం భారతదేశం నుండి వచ్చిన 283 మంది యాత్రికుల మొదటి బ్యాచ్కు సౌదీ రవాణా మరియు లాజిస్టిక్స్ సేవల మంత్రి సలేహ్ అల్-జాసర్ స్వాగతం పలికారు. ఈ సీజన్ లో వేలాది మంది యాత్రికులు వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళతారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ల ఆదేశాల మేరకు యాత్రికులు హజ్ యాత్రను సజావుగా జరిగేలా చూసేందుకు రవాణా మరియు లాజిస్టిక్స్ రంగం తగిన ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అల్-జాసర్ తెలిపారు. ఈ సంవత్సరం కార్యకలాపాలలో ఆరు విమానాశ్రయాలలో యాత్రికుల కోసం 27వేల కంటే ఎక్కువ బస్సులను ఉపయోగించారు. యాత్రికుల కోసం హరమైన్ హై-స్పీడ్ రైల్వే మరియు అల్-మషాయర్ అల్-ముగద్దస్సా మెట్రో లైన్ మధ్య 5,000 ట్రిప్పులకు పైగా నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







