ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- May 09, 2024న్యూ ఢిల్లీ: ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బంది పై యాక్షన్కు దిగింది. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నట్లుండి సెలవులు పెట్టడంతో.. దాదాపు 80 ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది యజమాన్యం. ఏకంగా 30 మంది ఉద్యోగులను తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది.
వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే అందరినీ తొలగిస్తామని హెచ్చరించింది. 3వందల మంది ఉద్యోగుల మూకుమ్మడి సెలవులతో విమానాలు రద్దయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది ఎయిర్ఇండియా. విధుల్లో చేరకపోతే మరింత మందిని తొలగించేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల్లో వెళ్లిన సిబ్బందితో సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించే అవకాశం ఉంది. క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవుల్లో వెళ్లడంతో బుధవారం 80, గురువారం మరో 85 సర్వీసులను రద్దు చేశారు.
ముందస్తు ప్రణాళికలో భాగంగానే మూకుమ్మడి సెలవు పై వెళ్లారని.. 30 మందికి పంపిన తొలగింపు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఎయిర్ ఇండియా సంస్థ. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని..సంస్థ ప్రతిష్ఠకూ నష్టం జరిగిందని తెలిపింది. క్యాబిన్ క్రూ సిబ్బంది వ్యవహరించిన తీరు సంస్థ నిబంధనలకు విరుద్ధమని.. అందువల్లే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చింది ఎయిర్ ఇండియా యజమాన్యం.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో..AIX కనెక్ట్ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్ క్రూ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 3వందల మంది క్యాబిన్ సిబ్బందితో ఏర్పడిన యూనియన్ ఆరోపించింది. కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఇవ్వటంతో పాటు సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని వివరించింది ఎంప్లాయిస్ యూనియన్.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు