ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- May 09, 2024
న్యూ ఢిల్లీ: ఉద్యోగులకు షాక్ ఇచ్చింది ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్. మూకుమ్మడి సెలవులు పెట్టిన సిబ్బంది పై యాక్షన్కు దిగింది. దాదాపు 3వందల మంది క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నట్లుండి సెలవులు పెట్టడంతో.. దాదాపు 80 ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్లు రద్దయ్యాయి. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది యజమాన్యం. ఏకంగా 30 మంది ఉద్యోగులను తొలగించింది. మిగిలిన వారికి అల్టిమేటం జారీ చేసింది.
వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే అందరినీ తొలగిస్తామని హెచ్చరించింది. 3వందల మంది ఉద్యోగుల మూకుమ్మడి సెలవులతో విమానాలు రద్దయిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది ఎయిర్ఇండియా. విధుల్లో చేరకపోతే మరింత మందిని తొలగించేందుకు కూడా సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల్లో వెళ్లిన సిబ్బందితో సంస్థ ప్రతినిధులు సమావేశమై చర్చించే అవకాశం ఉంది. క్యాబిన్ క్రూ సిబ్బంది సెలవుల్లో వెళ్లడంతో బుధవారం 80, గురువారం మరో 85 సర్వీసులను రద్దు చేశారు.
ముందస్తు ప్రణాళికలో భాగంగానే మూకుమ్మడి సెలవు పై వెళ్లారని.. 30 మందికి పంపిన తొలగింపు లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఎయిర్ ఇండియా సంస్థ. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయని..సంస్థ ప్రతిష్ఠకూ నష్టం జరిగిందని తెలిపింది. క్యాబిన్ క్రూ సిబ్బంది వ్యవహరించిన తీరు సంస్థ నిబంధనలకు విరుద్ధమని.. అందువల్లే చర్యలు తీసుకోవాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చింది ఎయిర్ ఇండియా యజమాన్యం.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో..AIX కనెక్ట్ విలీన ప్రక్రియ మొదలైనప్పటి నుంచి క్యాబిన్ క్రూ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులతో కంపెనీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని 3వందల మంది క్యాబిన్ సిబ్బందితో ఏర్పడిన యూనియన్ ఆరోపించింది. కొత్త ఒప్పందంలో భాగంగా తక్కువ వేతనం ఇవ్వటంతో పాటు సిబ్బంది అందరినీ సమానంగా చూడడం లేదని వివరించింది ఎంప్లాయిస్ యూనియన్.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







