చైనా లో మరో వైరస్..భయమేమి లేదంటున్న WHO
- July 02, 2020

బీజింగ్: చైనాలో మరో స్వైన్ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్త ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. మరో సంక్షోభం వస్తుందేమోనని ప్రజలు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కొత్త స్వైన్ ఫ్లూ వైరస్గా చెబుతున్న ఈ జీ4 వైరస్ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకూ ఈ వైరస్పై అందుబాటులో ఉన్న సమాచారం విశ్లేషణే తాజా అధ్యయనం. పందుల పెంపకం దారుల్లో ఎంత మంది దీని బారినపడ్డారనే విషయాన్ని కూడా ఆ అధ్యయనం చర్చించింది. అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైక్ రయన్ తెలిపారు. అమెరికా జర్నల్లో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చైనాలో కొత్త వైరస్ కళ్లుతెరిచిందనే విశ్లేషణలు ఈ అధ్యయనం ఆధారంగా వెలువడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







