చైనా లో మరో వైరస్..భయమేమి లేదంటున్న WHO
- July 02, 2020

బీజింగ్: చైనాలో మరో స్వైన్ఫ్లూ వైరస్ కళ్లు తెరిచిందన్న వార్త ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. మరో సంక్షోభం వస్తుందేమోనని ప్రజలు కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కొత్త స్వైన్ ఫ్లూ వైరస్గా చెబుతున్న ఈ జీ4 వైరస్ను 2011 నుంచీ తమ సంస్థ గమనిస్తోందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకూ ఈ వైరస్పై అందుబాటులో ఉన్న సమాచారం విశ్లేషణే తాజా అధ్యయనం. పందుల పెంపకం దారుల్లో ఎంత మంది దీని బారినపడ్డారనే విషయాన్ని కూడా ఆ అధ్యయనం చర్చించింది. అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ మైక్ రయన్ తెలిపారు. అమెరికా జర్నల్లో ఇటీవల ప్రచురితమైన ఈ అధ్యయనం పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చైనాలో కొత్త వైరస్ కళ్లుతెరిచిందనే విశ్లేషణలు ఈ అధ్యయనం ఆధారంగా వెలువడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం









