ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లో 'కొవాగ్జిన్' కరోనా వైరస్ వ్యాక్సిన్..
- July 03, 2020
కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రపంచాన్ని కొవిడ్ నుంచి విముక్తి చేయాలని దాదాపుగా 17 ప్రముఖ ఫార్మా సంస్థలు రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇవి సత్ఫలితాలిస్తే ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)భావిస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనగల్ బలరాం భార్గవ ఓ లేఖను విడుదల చేశారు.
వ్యాక్సిన్ తుది దశకు చేరుకోవడంలో క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని భార్గవ లేఖలో పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు కావలసిన అనుమతులు పొందాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై భారత్ బయోటెక్ స్పందించడానికి నిరాకరించింది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచంలో కొవిడ్ పై సమర్ధవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ నిలవనుంది. ఈ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







