ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లో 'కొవాగ్జిన్' కరోనా వైరస్ వ్యాక్సిన్..
- July 03, 2020
కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకువచ్చి ప్రపంచాన్ని కొవిడ్ నుంచి విముక్తి చేయాలని దాదాపుగా 17 ప్రముఖ ఫార్మా సంస్థలు రేయింబవళ్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇవి సత్ఫలితాలిస్తే ఆగస్ట్ 15 నాటికి మార్కెట్లోకి వ్యాక్సిన్ విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)భావిస్తోంది. ఈ మేరకు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనగల్ బలరాం భార్గవ ఓ లేఖను విడుదల చేశారు.
వ్యాక్సిన్ తుది దశకు చేరుకోవడంలో క్లినికల్ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 12 సంస్థల సహకారం అత్యంత కీలకమని భార్గవ లేఖలో పేర్కొన్నారు. జూలై తొలి వారంలోనే మనుషులపై ప్రయోగాలు ప్రారంభించేందుకు కావలసిన అనుమతులు పొందాలని అందులో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై భారత్ బయోటెక్ స్పందించడానికి నిరాకరించింది. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచంలో కొవిడ్ పై సమర్ధవంతంగా పనిచేసే తొలి వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ నిలవనుంది. ఈ వ్యాక్సిన్ ను ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







