బుదయలో మిలియన్ దినార్ల వ్యయంతో మరీనా పార్క్
- February 03, 2016
బహ్రైన్ మరీనా అభివృద్ధి సంస్థ ఒక ఆక్వా పార్క్ , జెట్ స్కైస్ , స్కూబా డైవింగ్ మరియు ఫెర్రీ సేవలను ఒకే
ప్రాంతంలోనే ఉండేవిధంగా ఒక నూతన బహుళార్ధక మిలియన్ దినార్ల పార్క్ ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభించనుంది.
ఉత్తర పురపాలక సమాఖ్యచే ఆమోదించబడిన ఈ ప్రాజెక్ట్ ను బుదయ సముద్ర తీర రేఖ సమీపంలో మరీనా పార్క్
నిర్మించబడనున్నట్లు మునిసిపల్ ఉన్నతాధికారి యూసఫ్ అల్ ఘటం తెలిపారు. సువిశాల సముద్ర తీరం తమ
పురపాలక పరిధిలో ఉన్నప్పటకి సరిగా వినియోగించుకోలేక పోయామని గతంలో అందుకు తగిన నిధులు లేవని
చెబ్తూ, బహుళార్ధక మిలియన్ దినార్ల పార్క్ ప్రాజెక్ట్ ద్వారా పురపాలక ఆదాయం క్రమేపి పెంచుకోవడమే కాక
పర్యాటకులను ఆకర్షించగలమనె భావన తమకు కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









