బంగారం దిగుమతులు: ట్యాక్స్ నిర్ణయం బ్యాక్ ఫైర్
- February 03, 2016
బంగారం దిగుమతులకు సంబంధించి భారత ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలు బెడిసికొడుతున్నాయి. అక్రమ బంగారం దిగుమతులు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారైంది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్ళు జరిపేవారికి సంబంధించి 'ట్యాక్స్ కోడ్' విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చాక ఈ అక్రమ బంగారం రవాణా మరింతగా పెరిగిపోయింది. జనవరి 1 నుంచి 2,00,000 రూపాయల పైన విలువ చేసే బంగారం కొనదలచుకుంటే ప్యాన్ నంబర్, ట్యాక్స్ కోడ్ని సమర్పించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగారం వ్యాపారులూ అక్రమ బంగారం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. పాన్ కార్డ్ లేని వినియోగదారులు కొనుగోళ్ళకు వెనుకాడుతుండడంతే బంగారం వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనివారి నుంచే బంగారం డిమాండ్ ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నిబంధనలెలా ఉన్నా, బంగారం కొనుగోళ్ళు తప్పడంలేదు. దాంతో అక్రమ బంగారం వినియోగానికే అవకాశాలెక్కువవుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







