బంగారం దిగుమతులు: ట్యాక్స్ నిర్ణయం బ్యాక్ ఫైర్
- February 03, 2016
బంగారం దిగుమతులకు సంబంధించి భారత ప్రభుత్వం కొత్తగా విధించిన నిబంధనలు బెడిసికొడుతున్నాయి. అక్రమ బంగారం దిగుమతులు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా తయారైంది. ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్ళు జరిపేవారికి సంబంధించి 'ట్యాక్స్ కోడ్' విధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చాక ఈ అక్రమ బంగారం రవాణా మరింతగా పెరిగిపోయింది. జనవరి 1 నుంచి 2,00,000 రూపాయల పైన విలువ చేసే బంగారం కొనదలచుకుంటే ప్యాన్ నంబర్, ట్యాక్స్ కోడ్ని సమర్పించవలసి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో బంగారం వ్యాపారులూ అక్రమ బంగారం వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. పాన్ కార్డ్ లేని వినియోగదారులు కొనుగోళ్ళకు వెనుకాడుతుండడంతే బంగారం వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనివారి నుంచే బంగారం డిమాండ్ ఉంటోందని వ్యాపారులు చెబుతున్నారు. నిబంధనలెలా ఉన్నా, బంగారం కొనుగోళ్ళు తప్పడంలేదు. దాంతో అక్రమ బంగారం వినియోగానికే అవకాశాలెక్కువవుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









