సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రం

- February 03, 2016 , by Maagulf
సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రం

తెలుగు సినీ అభిమానులలో మెగా ఫ్యామిలీతో పాటు, నందమూరి ఫ్యామిలీకు ప్రత్యేక గుర్తింపు ఉండగా,ఈ ఫ్యామిలీ హీరోలతో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్. రవి కుమార్ చౌదరి తెరకెక్కించనుండగా, కె.ఎస్. రామారావు నిర్మించనున్నారు.పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎస్. రవికుమార్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంథించిన స్టోరీ లైన్‌ను సాయి ధరమ్ కు వినిపించగా, ఈ యంగ్ హీరో ఓకే అన్నట్టు తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ నుండి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది.ఒకవేళ అన్నీ కుదిరి ఈ సినిమా పట్టాలెక్కితే ఈ మల్టీ స్టారర్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com