తెలంగాణలో:కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు
- July 09, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,410 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ల సంఖ్య 30,946కు చేరింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 7మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 331కు చేరింది. ఇప్పటి వరకు 18,192 మంది కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జి కాగా,12,423 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా GHMCలో 918 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 125, మేడ్చల్లో 67, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్ జిల్లాలో 34, కరీంనగర్లో 32 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23, నల్లగొండ జిల్లాలో 21, నిజామాబాద్ జిల్లాలో 18, సూర్యాపేట జిల్లాలో 10, మహబూబ్నగర్ జిల్లాలో 8, మెదక్ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8, వికారాబాద్ 5, మహబూబాబాద్ జిల్లాలో 5, వరంగల్ రూరల్ జిల్లాలో 7, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, వనపర్తి, గద్వాల జిల్లాలలో 2 చొప్పున పాజిటివ్ కేసులు నమోదు కాగా, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, ములుగు, సిద్దిపేట జిల్లాలలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









